సిద్ధం బహిరంగ సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన సీఎం వైయస్ జగన్.. రేపటి నుంచి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. వైయస్ఆర్సీపీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. అనంతపురం తాడిపత్రిలో రేపు తొలి ఎన్నికల ప్రచార సభ జరగనుంది. మే 11వ తేదీ దాకా రోజూ మూడు సభలు నిర్వహించేలా వైయస్ఆర్సీపీ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.