ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మీద ఆధార పడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎపుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజన కోసం మాత్రమే బిల్లుల విషయంలో సమర్ధించామన్నారు. రాజకీయ ప్రయోజనాలు కోసం కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గిస్తే... బీజేపీ కొట్టుకు పోతుందన్నారు. బీజేపీతో రాజకీయ పరమైన సంబంధాలు లేవని.. తాము ఎప్పుడూ సంఘర్షణ పడలేదని మంత్రి పేర్కొన్నారు.