ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం వైయస్ జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే. ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదన్నారు. ఏపీలో మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఖాయమని వీరశివారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.