ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 09:06 PM

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు నిఘా పెంచారు. కాటన్‌ బ్యారేజీ కూడలిలో తనిఖీలు చేస్తుండగా విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కంటైనర్‌ వాహనాన్ని డీఎస్పీ అంబికాప్రసాద్‌, సీఐ వినయ్‌మోహన్‌ ఆపారు. ఏఈఆర్‌వో అప్పారావు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇంఛార్జ్ గోపాలరావు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారుల సమక్షంలో కంటైనర్‌ను తెరిపించి పరిశీలించగా 1.764 కిలోల బంగారం, 71.743 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.8.73 కోట్లుగా నిర్ధారించారు. రాజమహేంద్రవరంలోని నగల షాపులకు వీటిని తరలిస్తున్నట్లు వాహన డ్రైవర్‌, సంబంధిత సిబ్బంది పోలీసులకు తెలిపారు. రవాణాకు అనుమతి పత్రాలు లేనందున నగలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, రిటర్నింగ్‌ అధికారి, జేసీ తేజ్‌భరత్‌ ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీకి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com