ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఈనెల 22వ తేదీ అనగా సోమవారం రాత్రి చీరాల రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. షర్మిలారెడ్డి ఆ రాత్రికి చీరాలలోనే బస చేసి 23న పట్టణంలో రోడ్ షోలో పాల్గొంటారని ఆ వర్గాలు వివరించాయి. ఇక్కడనే ఆమంచికి షర్మిలారెడ్డి బి. ఫారం అందజేస్తారని, 23నే ఆమంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాలలో నామినేషన్ దాఖలు చేస్తారని ఆ వర్గాలు చెప్పాయి.