వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని హెచ్చరించారు. ఫ్యాన్కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం వైయస్ జగన్ మండిపడ్డారు.