రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైయస్ఆర్ సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ దాఖలు చేశారు. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.