ప్రశాంతంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఇలా హత్యాయత్నం సంఘటనలు జరగలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో తిరిగి ఘన విజయం సాదించబోతోందని తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ లు ఇలాంటివాటికి పాల్పడేలా చేస్తున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి ని బైక్ తో వేగంగా ఢిొకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడని,తాము పరామర్శించిన సమయంలో డాక్టర్లు ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారని..కుటుంబసభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లోకేష్ ఓటమి ఖాయం కావడంతో ఏమిచేయాలో పాలుపోని స్దితిలో ఇలాంటి దుర్మార్గాలకు తెగబడుతున్నారని అన్నారు.దాడి చేసిిన సందర్భంలో జై తెలుగుదేశం,జై లోకేష్ అంటూ నినాదాలు చేసి తమ వికృతమనస్తత్వాన్ని చాటుకున్నారని అన్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా సంయమనంతో ఉన్నారని అన్నారు. ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలని,విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇటీవల కొందరు ఐఏఎస్, ఐపిఎస్ లపై పదే పదే ఫిర్యాదులు చేయడం వారి బదిలీల నేపధ్యంలో లోకేష్ తనకు ఎదురేలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి ఘటనలో బాధ్యలను వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే తాము కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టాల్సి వస్తుందని తెలియచేశారు.