చంద్రబాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. వైయస్ జగన్ గారి అభివృద్ధి ఇంటింటా..! కనిపిస్తుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ తెలిపారు. చంద్రబాబు, వైయస్ జగన్ హాయంలో ఎవరెంత అప్పు చేశారనేది గణాంకాలు క్లియర్గా చెబుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం చేసింది రూ.2.80 లక్షల కోట్లు కాగా, ప్రతిపక్షాలు, పచ్చమీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం.. రూ.11 లక్షల కోట్లు అప్పు ఎక్కడ్నుంచి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. దీనికి సమాధానం చంద్రబాబు చెబుతాడా..? ఈనాడు రామోజీరావు చెబుతాడా..? అని నిలదీశారు.