అల్లరిచేస్తున్న టిడిపి వారిని అలా చేయవద్దని అన్నందుకు వేగంగా బైక్ తో ఢీకొట్టించి హత్యాయత్నం దారుణం అని మురుగుడు హనుమంతరావు అన్నారు. మంగళగిరిలో వైసీపీ కార్యకర్త పై జరిగిన దాడిపై అయన స్పందిస్తూ.... ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు చేసిన పని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యపధ్దతిలో చేయాలని ఈ విధంగా హత్యాయత్నాలు చేయడం దారుణం అన్నారు. దీనిపై పోలీసు అధికారులు వెంటనే జోక్యంచేసుకుని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో లోకేష్ రెండోసారి ఓడిపోతాననే భయంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.