ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేకా వెంకటరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించిన వైసీపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 12:40 PM

మంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మండిప‌డ్డారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త మేకా వెంకటరెడ్డిని బైక్ తో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటనలో హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని  వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. తాడేపల్లి సీఎస్ఆర్‌ కల్యాణమండపం రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి మోటార్ బైక్ లతో అల్లరి చేస్తున్నటిడిపి కార్యకర్తలను ఏంటి అల్లరి చేస్తున్నారని ప్రశ్నించడం...దానికి ఆగ్రహించిన వారు ఆ బైక్ తో వేగంగా ఢిీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వెంకటరెడ్డిని మణిపాల్ ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బ్రెయిన డెడ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు వెంకటరెడ్డిని చూసి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com