బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి శుక్రవారం వైసీపీకి రాజీనామ చేశారు. కళ్యాణదుర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో ప్రజావేదిక వద్ద వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎర్రగొండాపురం గ్రామం వైసీపీకి చెందిన 8కుటుంబాలు సురేంద్ర బాబు సమక్షంలో టిడిపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.