పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఈనెల 22వ తారీఖున పర్చూరు ఆర్. ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపారు. క్యాంపు శుక్రవారం కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో ఆర్. ఓ కార్యాలయానికి చేరుకుంటారని, ఈ కార్యక్రమానికి కూటమి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 2014, 2019 ఎన్నికల్లో పర్చూరు నుండి ఏలూరి గెలిచారు.