చీరాల నియోజకవర్గ టిడిపి పరిశీలకులుగా నియమితులైన నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టారు. టిడిపి, బిజెపి, జనసేనల కూటమి మధ్య ఉన్న సమన్వయాన్ని ఆయన అధ్యయనం చేశారు. లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారు. అలాగే శుక్రవారం టిడిపి అభ్యర్థి కొండయ్య చిన్న కుమారుడు మహేంద్రనాధ్ తో కలిసి ఆయన మాజీ కౌన్సిలర్ గుద్దంటి సత్యం కుమారుడు దుర్గా, తదితరులతో మంతనాలు సాగించారు.