అద్దంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన నలుగురు వాలంటరీలు, శుక్రవారం తమ వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని గ్రామ సచివాలయ అధికారికి అందజేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లేనందున రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వాలంటరీలను పర్మినెంట్ చేస్తాడని పలువురు వాలంటరీలు తెలియజేశారు. వైసీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.