అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రేపల్లె ఫైర్ ఆఫీసర్ వై సాంబశివరావు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంకుల వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ సాంబశివరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించే దిశగా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్నామన్నారు.