ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో గురువారం 80 కుటుంబాలు టిడిపిని విడి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా జెడ్పిటిసి వెంకట నాయుడు సమక్షంలో 80 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి జడ్పిటిసి వెంకట్ నాయుడు ఆహ్వానించారు. వైసీపీలో చేరిన వారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.