ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం లోని రిటనింగ్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ కె. రాముల నాయక్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్. ఐ లు, కానిస్టేబుల్ లు బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. శుక్రవారం నామినేషన్లు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందోస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.