ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నామినేషన్‌ వేయనున్న బగ్గు రమణమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:53 PM

నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు బగ్గు రమణమూర్తి శనివారం నామినేషన్‌ వేయనున్నట్లు టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8 గంటలకు రమణమూర్తి తన స్వగ్రామం పోలాకి మండలం మబుగాంలో బయలుదేరిగా ర్యాలీగా నరసన్న పేటకు బయలుదేరుతారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com