తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో ఎస్ఈబి అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సీఐ పి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో చప్పిడి కృష్ణకుమారి నుంచి ఐదు లీటర్ల నాటుసారా, నెమలిలో యాదాల జయరాజ్ నుంచి 15 తెలంగాణ మద్యం బాటిళ్లు, ఎ,కొండూరు మండలం గొల్లమందలతండాలో బాణావత్ నుంచి 10 ఆంధ్ర మద్యం బాటిళ్లు, విస్సన్నపేట మండలం తాతకుంట్లలో సారాకేసులో పాతముద్దాయి బాణావత్ అశోక్ను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించడం జరిగిందని సీఐ వివరించారు. ఈ దాడుల్లో ఎస్ఈబి ఎస్సై జి.రఘు, జగ్గారావు, బిఎంపీపీ ఎస్సై కెఎండి ఆరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు.