ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:46 PM

విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో పోర్టులో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఏ ముడి పదార్థమూ వెళ్లడం లేదు. తమకు కనీ స వేతనాలు ఇవ్వాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాలని, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాల నే డిమాండ్లతో పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నా రు. పోర్టు యాజమాన్యం ఇప్పటివరకు వీరితో చర్చలు జరపలేదు. మరోవైపు స్టీల్‌ప్లాంటుకు బొగ్గు, లైమ్‌స్టోన్‌, ముడి ఇనుము అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయడం లేదు. గంగవరం, దిబ్బపాలెం మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి గంగవరం పోర్టుకు అప్పగించారు. ఆయా గ్రామాల్లో 600 మందికి మూడు దశ ల్లో పోర్టులో కార్మికులుగా పనిచేయడానికి అవకాశం కల్పించారు. 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి రూ.18 వేలు, పదేళ్ల నుంచి చేస్తున్న వారికి రూ.16 వేలు, ఏడేళ్ల నుంచి ఉన్న వారికి రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. పోర్టులో ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎ్‌సఐ ఆస్పత్రికి పంపించి యాజమాన్యం చేతులు దులుపుకుంటోంది. దీనినే కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కనీస వేతనాల చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 8 నెలల క్రితం 64 రోజుల పాటు ఆందోళన చేస్తే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కలెక్టర్‌ మల్లికార్జున చర్చలు జరిపి విరమింపజేశారు. ఎవరికై నా ప్రమాదం జరిగితే సమీప కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించాలని, కార్మికుడు చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించడానికి, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. కానీ, దాన్ని ఇప్పటివరకూ అమలు చేయలేదు. గట్టిగా నిలదీస్తే... గుజరాత్‌లోని ముంద్రా పోర్టు యాజమాన్యానికి లేఖ రాశామ ని, వారు ఏది చెబితే అదే చేస్తామని అంటున్నారు. యాజమాన్య వైఖరికి విసిగిపోయిన కార్మికులు 8 రోజుల క్రితం పోర్టు గేట్లకు తాళాలు వేసి, మెరుపు ఆందోళనకు దిగారు. లోపల సుమారు 200 మంది కార్మికులు ఉండిపోయారు. వారికి బయట ఆందోళన చేస్తున్నవారే చందాలు వేసుకొని భోజనాలు పంపుతున్నారు. పోర్టు కార్మికుల ఆందోళనతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ముడిపదార్థాల సమస్య ఏర్పడింది. దీం తో ప్లాంటు యాజమాన్యం అభ్యర్థన మేరకు కలెక్టర్‌ పోర్టు కార్మికులను చర్చలకు పిలిచారు. పోర్టు అధికారులను కూడా రప్పించారు. గత సమావేశపు తీర్మానా లు ఎందుకు అమలు చేయలేదని కలెక్టర్‌ ప్రశ్నిస్తే... దానిపై తాము ఏమీ సంతకాలు చేయలేదని, అమలు చేయాల్సిన అవసరం లేదని వారు సమాధానమిచ్చా రు. దాంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని యాజమాన్యం ఏది చెబితే అదే చేస్తున్నారు తప్పితే ఇక్కడ వీరి చేతిలో ఏమీ లేదని గ్రహించి ఆయన కూడా చేతులెత్తేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు తాము ఏమీ చేయలేమని స్పష్టంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com