పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ 23న నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కి పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్న నిమ్మక జయకృష్ణకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం బీ-ఫాం అందించారు. జనసేన తరఫున బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో 20 మందికి బుధవారమే బీ-ఫాంలు అందించారు. కాగా, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీలో చేరారు.