రీజనల్ స్థాయిలో అన్ని విభాగాల్లో మదనపల్లె ఆర్టీసీ వనడిపో ప్రథమ స్థానం సాధించిందని జిల్లా రవాణా అధికారి రాము పేర్కొన్నారు. గురువారం మదనపల్లె వన డిపో మే నేజరు వెంకట రమణారెడ్డిని దుశ్శాలువ కప్పి, ప్రశంసా పత్రంతో సన్మానించారు. రీజ నల్లో ఇంధనం పొదుపు, కేఎంపీఎల్, ఈపీకే, పాల నాపరంగా, ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో మొద టి స్థానంలో మదనపల్లె వన డిపో ఉందన్నారు. అలాగే ఈ నెల 25న బి,కొత్తకోట మార్గం లో లక్కీ డిప్ నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. ప్రయా ణికులు ఈ మార్గంలో ప్రయాణం చేసిన తరువాత టికెటు వెనుక భాగంలో పేరు, ఊరుపేరు, సెల్నెం బర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్బాక్సులో వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు.