ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్ ఈ నెల 23న నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10.45 గంటకు ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని రవికుమార్ కోరారు.