పాతపట్నం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు పైల బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కింజ రాపు అచ్చెంనాయుడు, పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహననాయుడు హాజరుకానున్నారని పేర్కొన్నారు.