యాడికి నారాయణస్వామి కాలనీలో నాగలకట్ట వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులకు వాలంటీరు రాము అడ్డుపడుతున్నాడంటూ స్థానికులు ఎంపీడీవో సావిత్రికి గురువారం ఫిర్యాదు చేశారు. పంచాయతీకి సంబంధించి 12 సెంట్ల స్థలం ఉందని, అందులో వృద్ధులు, పిల్లల కోసం పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చా రన్నారు. ఆ స్థలంలో ముందుగా కంచె వేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వాలంటీరు అడ్డుపడుతూన్నాడని వాపోయారు. స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందచేశారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.