ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 12:26 PM

సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో వైయ‌స్ జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌తో చేసిందే.. అది ఆకతాయిల చర్య కాదన్నారు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రచార రథాలను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా స‌జ్జ‌ల మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సీఎం వైయ‌స్‌ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు.. మన రాష్ట్రంలో మళ్లీ సీఎం వైయ‌స్‌ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.   సీఎం వైయ‌స్‌ జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే.. ఇది ఆకతాయిల చర్య కాదని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com