ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 12:24 PM

కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జూపూడి ప్రభాకర్ రావు చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా? అని ఆయ‌న నిల‌దీశారు. గురువారం జూపూడి ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ..... పేదల పక్షాన నిలిచిన, పనిచేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ మాటను రాష్ట్రంలో ఉన్న ప్రతీ పేదకాలనీల్లోనూ అందరూ ఒప్పుకునే మాటనే. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారి రాజ్యాంగ సూత్రాలను అమల్లోనూ.. ఆలోచనలోనూ ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఒక్కరే. అలాంటిది. మా నాయకుడు జగన్‌ గారిపై ఇవాళ ఈనాడు దినపత్రిక ఓ వార్త ద్వారా విషం కక్కింది. దళితుల మీద కొత్త ప్రేమను ఒలకబోస్తూ ఓ కథనం రాసుకొచ్చింది. జగన్‌ గారికి దళితుల పట్ల వ్యతిరేకత ఉందంటూ.. ఆయన్ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగింది. అందులో భాగంగా చంద్రబాబు దళితుల ఆపద్భాందవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చింది. ఈ వార్తను చదివి ప్రజలంతా నవ్వుకుంటున్నారు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com