ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభంజనంలా వైయస్ఆర్‌సీపీ విజయం సాధించబోతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 12:22 PM

వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం కోసం  యూఎస్ ఏకి చెందిన ఎన్ ఆర్ ఐ మిత్రులు 13 వాహనాలను సమకూర్చడం జరిగింది. ఇప్పుడే వాటిని ప్రారంభించాం. పూర్తిగా ఎవరు అడిగింది కాదు స్వచ్ఛందంగా జగన్,వైయస్సార్ సిపి అభిమానులు వీటిని అందించారు. ఈ ఐదు సంవత్సరాలుగా జరిగిన సంక్షేమం, అభివృధ్ది లాగానే మరో ఐదేళ్ళు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. చల్లా మధు వాళ్ళ టీమ్ కోఆర్డినేట్ చేసి వాటిని నియోజకవర్గాలకు పంపారు. అక్కడ ఈ వాహనాల ద్వారా జగన్ గారి పాలనలో పేద, ఎస్సి, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు జరిగిన మేలు, ప్రయోజనాలను ప్రదర్శించడం జరిగుతుంది. వైయ‌స్ జగన్  విజయం మా విజయం అనుకుని పనిచేస్తున్నారు. ప్రభంజనంలా వైయస్ఆర్‌సీపీ  విజయం సాధించబోతోంది. జగనన్న వల్ల ఆంద్రప్రదేశ్ బాగుపడుతుందని భావిస్తున్నారు. ఈ మహా యజ్ఞంలో దేశ, విదేశాలలో ఉన్నవారు స్వచ్ఛంధంగా భాగస్వాములు అవుతున్నారు.అందరూ కూడా జగన్ గారు మరోసారి విజయం సాధించాలనే మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నారు. వైయ‌స్ జగన్ ఘన విజయం సాధించబోతున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే ఊపు కనిపిస్తోందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com