చిట్వేలి మండలం కె. వి. ఆర్. ఆర్. పురం పంచాయతీలో ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గం బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జరగనున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.