ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ పరిధిలో గురువారం అధికారులు ప్రధాన వీధులలో ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆక్రమణలను తొలగించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆక్రమణలను తొలగిస్తున్నామని నగర పంచాయతీ అధికారులు తెలిపారు. రోడ్లను ఆక్రమించుకొని రోడ్లకు అడ్డంగా వస్తువులను లేదా కట్టడాలను ఏర్పాటు చేసే వారికి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.