ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 16 నుంచి 30వ తేదీ వరకు కనిగిరి పట్టణం మెయిన్ రోడ్డులోని వ్యాపార దుకాణాలు మూసివేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి జాన్ ఇర్వాన్ తెలిపారు. నామినేషన్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆర్డీవో కార్యాలయానికి 200 మీటర్ల దూరం వరకు ఉన్న దుకాణాలను ఉదయం 5 నుంచి 7 గంటల వరకు మూసి వేయాలన్నారు. వ్యాపారా నిర్వహకులు సహకరించాలన్నారు.