అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. ఇవాళ వైయస్ఆర్సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బొంతు రాజేశ్వరరావు వైయస్ఆర్సీపీలో చేరారు. తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. జనసేన, టీడీపీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.