ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోష్ తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. ఇందులో భాగంగా వారు కూడా ఓటర్ల వివరాలు పరిశీలిస్తుండగా వైకాపా నాయకులు అడ్డగించారు. వివరాలు సేకరించరాదని వాగ్వాదానికి దిగారు. అంతటితో వైకాపా నాయకులు సంతోష్ పై మూకుమ్మడిగా దాడి చేశారు.