తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ నామినేషన్ కార్యక్రమం జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, డా. సురేంద్ర, పట్టణాధ్యక్షులు రమేష్, బీజేపీ ఆదర్శ్, జనసేన ఉమేష్లు మాట్లాడుతూ నావినేషన్కు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.