ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు పవన్ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:20 PM

రైతుల పక్షాన ఆలోచించి, కష్టాలను అర్ధం చేసుకోగల నిజమైన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. యండపల్లిలో బుధవారం అన్నదాతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురు రైతులు కష్టనష్టాలను ఆయనకు వివరించారు. అనం తరం మాట్లాడుతూ ఎటువంటి రాజకీయ పదవి లేకుండానే రాష్ట్రం ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చిన పవన్‌ పిఠాపురం ఎమ్మెల్యే అయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పిఠాపురాన్ని దేశంలో ఆదర్శ నియో జకవర్గం తీర్చిదిద్దగల సత్తా పవన్‌కు ఉందన్నారు. వ్యయ సాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి తద్వారా రైతులకు న్యాయం చేసే చర్యలు చేపడతారని నాగబాబు చెప్పారు. సమావేశం లో స్వేచ్ఛ ఫౌండేషన్‌ చైర్మన్‌ మురాలశెట్టి సునీల్‌కుమార్‌, జనసేనన రాష్ట్ర నాయకుడు మహేంద్రరెడ్డి, పిఠాపురం కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు తెలగంశెట్టి వెంకటే శ్వరరావు, మత్సా అప్పాజీ, సానా నాగు, ఎమ్‌.సత్తిబాబు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com