ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు, రాయలసీమ వాసులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 08:02 PM

రాయలసీమవాసులకు శుభవార్త.. ప్రత్యేక రైలు పట్టాలెక్కబోతోంది. కడప మీదుగా కాచిగూడ - కొచివేలి(త్రివేండ్రం)- కాచిగూడ ప్రత్యేక రైలు (07229 / 07230) నడపనున్నట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి ఈ నెల 18, 25 తేదీల్లో (గురువారం) ఉదయం 6.05 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు, డోన్‌, గుత్తి మీదుగా ఎర్రగుంట్లకు మధ్యాహ్నం 1.50కు, కడపకు 2.25కు చేరుకుంటుంది.


అనంతరం ఈ రైలు రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈ-రోడ్‌, కోయంబత్తూరు, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, చెంగనూరు, కొల్లాం మీదుగా కొచివేలికి శుక్రవారం ఉదయం 10.05 వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కొచివేలిలో ఈ నెల 19, 26 తేదీల్లో(శుక్రవారం) మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 6.25 గంటలకు కడప, ఎర్రగుంట్లకు 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.


మరోవైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సాధారణ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు. ఎస్‌ఎంవీ బెంగళూరు – గౌహతి (06521) అన్‌ రిజర్వుడు స్పెషల్‌ ప్రతీ మంగళవారం రాత్రి 11.40 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.20 గంటలకు బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 4.50 గంటలకు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి – ఎస్‌ఎంవీ బెంగళూరు (06522) అన్‌ రిజర్వుడు స్పెషల్‌ ప్రతి శనివారం గౌహతిలో ఉదయం 6.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.55 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com