ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్బంగా చేపట్టవలసిన బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్. పి సిద్దార్థ్ కౌశల్ మంగళవారం పరిశీలించారు. సీతారాముల కల్యాణానికి పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రించాలన్నారు.