సీఎస్ పురం మండలంలో మంగళవారం కనిగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాలను మండల టీడీపీ అధ్యక్షులు వెంగయ్య ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి మాగుంటను గెలిపించాలని కోరారు.