ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు. గులకరాయి కథ ఎవరు రచించారో గానీ కథలో పట్టులేదని.. అందుకే రక్తికట్టలేదంటూ వ్యాఖ్యలు చేశారు.