అనంతపురం జిల్లా, ఓబుళదేవరచెరువు మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు సూర్యశేఖర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మిట్టపల్లి పంచాయతీలో జిల్లా మైనార్టీ కార్యదర్శి మండోజీ ఆర్పీఖాన, పొగాకు షబ్బీర్, టీఎనటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు నిజాం తదితరులు సూపర్సిక్స్ పథకాలపై ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం కాగానే వాటిని అమలు చేస్తారని తెలిపారు. కూటమి గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయలని కోరారు. కార్యక్రమాల్లో తెలుగుయువత నాయకులు బూదిలి ఓబులరెడ్డి, బోనాల రామాంజి, బైరిశెట్టి, వీరయ్య, రామాంజి, తుమ్మలప్రసాద్, గంగాధర్, బోనాల లక్ష్మీనారాయణ, సురేంద్ర, శివానంద, చంద్ర, హనుమంతురెడ్డి, నంది నరసింహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.