ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి వస్తే మహిళలకు ఆర్‌టీ సీ బస్సుల్లో ఉచితం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:46 PM

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గిద్దలూరు నియోజవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. కొమరోలు మండలంలోని అల్లీనగరం, బ్రాహ్మణపల్లి పంచాయతీలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏటా రూ.20 వేల సాయం అంద జేయనున్నట్లు తెలిపారు. మహిళలకు మహిళా శక్తి పధకం ద్వారా మహిళలకు ఆర్‌టీ సీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ను కల్పిస్తున్నారు. వెనుకబడిన మన ప్రాంతానికి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్మో హన్‌రెడ్డి మరో మారు కోడికత్తి డ్రామాకు తెరపైకి తీశారన్నారు. మరోసారి మోసపోవడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే, వలంటీర్లను తొలగించకుండా నెలకు రూ.10 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను స్థానికుడినని స్థానికంగా అందు బాటులో ఉంటానని గిద్దలూరులోనే ఉంటూ ప్రజలకు సేవచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వైసీపీ అభ్యర్ధిని మార్కాపురం ప్రజలు తిరస్కరిస్తే గిద్దలూరుకు వచ్చారని, వారిని ఇక్కడ ప్రజలు నమ్మ పరిస్ధితి లేదన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో స్ధానికుడనైన తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డిను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు బిజ్జాల తిరుమలరెడ్డి, సొసైటీ మాజీ అద్యక్షులు పులకుర్తి వెంకటేశ్వర్లు, కో-ఆర్షన్‌ మాజీ సభ్యుడు షేక్‌ నబీ, నాయకులు కాంట్రాక్టర్‌ కృష్ణమోహన్‌రెడ్డి చలిచీమల శ్రీనివాస చౌదరి, లక్ష్మినరసయ్య, గోడి ఓబుల్‌రెడ్డి, ఎ మోహన్‌రెడ్డి, గోపాలక్రిష్ణయ్య, బోయిళ్ల బాలిరెడ్డి, పందరబోయిన గంగయ్య, నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com