ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనకు జతకట్టిన గాజు గ్లాస్, హమ్మయ్య అంటున్న జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:44 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన  పార్టీకి ఊపిరిపీల్చుకునే వార్త.! జనసేన గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గాజు గ్లాస్ గుర్తును జనసేనకే కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నాడు తీర్పును వెలువరించింది. దీంతో జనసేనకు భారీ ఊరట దక్కింది. హైకోర్టు తీర్పుతో జనసైనికులు ఆనందంలో మునిగితేలుతున్నారు.కాగా.. గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించొద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని పిటిషన్‌లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇటీవల ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com