ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 12:51 PM

 సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గెలవలేకపోతున్నామనే అక్కసుతో హత్యాయత్నానికి పాల్పడ్డారని, మే 13న జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఓట్ల రూపంలో కూటమి నేతలపై ప్రజాదాడి జరగనుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ వస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా, ఆరి్థకంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారని, గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు సముచిత స్థానం కలి్పంచిన ఘనత సీఎ వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కూడా సీఎం వైయ‌స్ జగన్‌ అండగా నిలుస్తున్నారని, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కావాలంటే వైయ‌స్ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com