ఏపీలో ఎన్నికల కురుక్షేత్రానికి సర్వం సన్నద్ధమైంది. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తిచేశాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్య, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఇక విజయమే లక్ష్యంగా సర్వేల ద్వారా గెలుపు గుర్రాలను అన్వేషించి మరీ ఎంపిక చేసిన రాజకీయపార్టీలు.. ఇక ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించనున్నాయి. ఈ క్రమంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరుఫున ఎవరు పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్న అభ్యర్థులను జిల్లాల వారీగా ఓ సారి పరిశీలిద్దాం..
నియోజకవర్గం వైఎస్సార్సీపీ టీడీపీ కూటమి
పాతపట్నం రెడ్డి శాంతి మామిడి గోవిందరావు
ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ ఎన్. ఈశ్వరరావు (బీజేపీ)
ఆముదాలవలస తమ్మినేని సీతారాం కూన రవికుమార్
టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ కింజరపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గొండు శంకర్
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ బగ్గు రమణ మూర్తి
పలాస సీదిరి అప్పలరాజు గౌతు శిరీష
ఇచ్ఛాపురం పిరియ విజయ బెందాళం అశోక్