విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో చోటు చేసుకుంది. చీపురు ఉమామహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన పెళ్లి మండపం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.