ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సీఐ మల్లికార్జున్ గురువారం సమావేశమయ్యారు. తిరుణాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకోవాలని కోరారు.