పేకాట స్థావరంపై దాడి చేసి భారీ మొత్తంలో నగదును పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ జిందాల్ కు వచ్చిన సమాచారం మేరకు ఆయన అప్రమత్తం చేయగా పర్చూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున వీరన్నపాలెం, రమణాయపాలెం గ్రామాల మధ్య పొలాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 18 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 2, 21, 400 నగదును, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రమేష్ చెప్పారు.