ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియాతో మాట్లాడేందుకు నేను భయపడను : మన్మోహన్‌ సింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 19, 2018, 03:17 PM

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. తానెప్పుడూ మీడియాకు దూరంగా లేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వస్తోన్న వరుస వివాదాలపై మోదీ మౌనంగా ఉండటం పట్ల ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ప్రజలు నన్ను మౌనంగా ఉండే ప్రధానమంత్రి అన్నారు. కానీ నేను ప్రధానిగా ఉన్న సమయంలో మీడియా ఎదుట మాట్లాడేందుకు ఎన్నడూ భయపడలేదు. మీడియాను రెగ్యులర్‌గా కలిసేవాడిని. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ప్రతిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేవాడిని’ అని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు.


2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించలేదని ఆయన విమర్శించారు. ఆయన రాసిన ‘ఛేంజింగ్‌ ఇండియా’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అనుకోకుండా ప్రధాని మంత్రి అవడమే కాదని, అనుకోకుండా ఆర్థిక శాఖ మంత్రి కూడా అయినట్లు తెలిపారు. 1991లో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంపైనా ఆయన స్పందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. దాని అనుసరిస్తూనే మధ్యప్రదేశ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com