తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలు మూసివేయనున్నారు. రేపటి నుంచి అన్ని ఆర్జిత సేవలను పునరుద్ధరించనున్నారు